నవతెలంగాణ-హైదరాబాద్ : తమ వార్షిక ‘ఫ్యామ్స్ డే అవుట్’ ఈవెంట్ ను అసాధారణమైన రీతిలో సింక్రోనీ సంస్థ నిర్వహించింది. మాదాపూర్ లోని హెచ్ఐసిసి నోవోటెల్లో జరిగిన ఈ కార్యక్రమం నవ్వులు, వినోదం మరియు ప్రశంసలతో ఉద్యోగులకు చిరస్మరణీయం గా నిలిచింది. ఉద్యోగులు, వారి కుటుంబాలు హాజరైన ఈ కార్యక్రమం లో మల్లఖంబా యాక్ట్ మరియు దివ్యాన్ష్, మనురాజ్ల ఉత్కంఠభరితమైన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.