నవతెలంగాణ – హైదరాబాద్ : ఈ నెల 10వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రకటించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపింది. అనంతరం సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు సభ తిరిగి ప్రారంభమవుతుందని తెలిపారు. రేపు సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. రేపు ఉదయం 9 గంటలకు కేబినెట్ సమావేశమై బడ్జెట్కు ఆమోదం తెలుపనుంది.