రిపేర్ లో ఉన్న బోర్, పంపులను బాగు చేసి ప్రజల దహాన్ని తీర్చాలి

నవతెలంగాణ – నెల్లికుదురు

నెల్లికుదురు తోరూర్ కేసముద్రం వెళ్లే క్రాస్ రోడ్ వద్ద ఉన్నటువంటి బోరు పంపును రిపేరు చేసి ప్రజల జహార్తిని తీర్చాలని ప్రజలు కోరుతున్నారు. ఈ ఎండాకాలం విపరీతంగా ఎండలు ఉండటంతో వివిధ గ్రామాలకు వెళ్లే ప్రజలు ఈ క్రాస్ రోడ్ వద్ద వివిధ గ్రామాలకు వెళ్లే ప్రజలు ఈ క్రాస్ రోడ్ వద్ద ఉంటారు. కానీ ఆ క్రాస్ రోడ్ వద్ద దాహం తీర్చుకోవడానికి ఆ ప్రాంతంలో ఎక్కడ నీరు లేక ప్రజలు ఇబ్బందులు ఉంటున్నారు. కావున తక్షణమే ఈ రిపేర్ లో ఉన్నటువంటి బోర్లు సంబంధిత అధికారులు చొరచూపి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు కృషి చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు .అంతేకాకుండా ఆ క్రాస్ రోడ్ వద్ద ఈ జరగబోయే పార్లమెంటు ఎన్నికలకు ఇక్కడనే చెక్ పోస్ట్ ను కూడా ఏర్పాటు చేశారని అక్కడ ఆగేటువంటి వాహనదారులు నీరు లేక కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంటదని ప్రజలు తెలుపుతున్నారు. కావున సంబంధిత గ్రామ మండల జిల్లా స్థాయి అధికారులు స్పందించి ఈ రిపేరులో ఉన్నటువంటి బోరును బాగు చేసి ప్రజల దహాన్ని తీర్చాలని కోరుకుంటున్నారు.
Spread the love