ఎన్నికల్లో కాంగ్రెస్‌ యువజన నాయకుల పాత్ర కీలకం

– ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌ రెడ్డి
నవతెలంగాణ-తాండూరు
పార్లమెంటు ఎన్నికల్లో యువజన కాంగ్రెస్‌ నాయకుల పాత్ర కీలకమని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. బుధవారం యాలాల మండలంలో ఏర్పాటు చేసిన యూత్‌ కాంగ్రెస్‌ సమావేశంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో తాండూరు నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీ వచ్చే విధంగా యువజన కాంగ్రెస్‌ నాయకులు పని చేయాలన్నారు.ఈ సమావేశంలో యూత్‌ కాంగ్రెస్‌ నేషనల్‌ సెక్రెటరీ జీషన్‌ హైమద్‌, కష్ణం రాజు చేవెళ్ల పార్లమెంట్‌ యూత్‌ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి, కావాలి సంతోష్‌ అసెంబ్లీ ఇన్‌చార్జి బస్వరాజు మండల ఇన్‌చార్జి నాయకులు, యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Spread the love