షోటైమ్లో ఇమ్రాన్ హష్మీ యాంటీ-హీరో రఘు ఖన్నా పాత్రని పోషించారు. హాట్స్టార్ స్పెషల్గా మార్చి 8 నుండి ప్రత్యేకంగా ఈ ‘షోటైమ్’ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ప్రసారం కానుంది. దీని గురించి ఇమ్రాన్ హష్మీ మాట్లాడుతూ, ”నేను పూర్తిగా క్లీన్, నీతివంతమైన పాత్రను పోషించగలనని నమ్మాను. నా స్క్రీన్ ఇమేజ్ని బట్టి కాకుండా అందులో కొంత భాగం నేను కనిపించే తీరు వల్ల ప్రేక్షకులు నా గురించి కుట్ర లేదా మోసపూరిత భావాన్ని ఫీల్ అవుతారు. నా మొదటి చిత్రం నుండి నేను కావాలని ఈ పాత్రలను ఎంచుకోలేదు. నా కెరీర్ ప్రారంభంలో అలాంటి పాత్రలకు అవకాశాలు వచ్చాయి. కాలక్రమేణా ప్రేక్షకులు నన్ను గ్రే షేడ్స్ ఉన్న పాత్రల్లో ఆదరించారు’ అని అన్నారు. ఇమ్రాన్ హష్మీ, మహిమా మక్వానా దర్శకత్వం వహించిన ఈ ధారావాహికలో మౌని రారు, రాజీవ్ ఖండేల్వాల్, శ్రియా శరణ్, విశాల్ వశిష్ఠ, నీరజ్ మాధవ్, విజరు రాజ్ మరియు నసీరుద్దీన్ షా కీలక పాత్రలు పోషిస్తున్నారు.