లండన్: మైసూర్ రాజు టిప్పు సుల్తాన్ ఖడ్గాన్ని లండన్లో వేలం వేశారు. ఆ ఆక్షన్లో టిప్పు సుల్తాన్ ఖడ్గం సుమారు రూ.140 కోట్లకు అమ్ముడుపోయింది. వేలం నిర్వహించిన బాన్హమ్స్ హౌజ్ ఈ విషయాన్ని వెల్లడించింది. అంచనా వేసిన దాని కన్నా ఏడు రెట్లు ఎక్కువ ధరకు అమ్ముడుపోయినట్లు బాన్హమ్స్ తెలిపింది. 18వ శతాబ్ధంలో ఎన్నో యుద్ధాలను గెలిచిన టిప్పు సుల్తాన్ ఈ ఖడ్గాన్ని వాడినట్లు ఆధారాలు ఉన్నాయి. టిప్పు సుల్తాన్కు టైగర్ ఆఫ్ మైసూర్ అన్న నిక్నేమ్ ఉంది. ఆయన తన సామ్రాజ్యాన్ని అత్యంత ధైర్యసాహాసాలు ప్రదర్శించి రక్షించుకున్నాడు. యుద్ధాల సమయంలో రాకెట్ ఆర్టిల్లరీ వాడాడు.