మృతురాలి చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న తుమ్మేటి సమ్మిరెడ్డి

నవతెలంగాణ – వీణవంక
మండలంలోని పోతిరెడ్డిపల్లి, మామిడాలపల్లి, చల్లూరు గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన పలు కుటుంబాలను జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తుమ్మేటి సమ్మిరెడ్డి బీఆర్ఎస్ నాయకులతో కలిసి శుక్రవారం పరామర్శించారు. పోతిరెడ్డిపల్లికి చెందిన ఓ దినపత్రిక విలేకరి మిడిదొడ్డి పరుశరాములు తల్లి లక్ష్మీనర్సమ్మ ఇటీవల మృతి చెందింది. కాగా ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆమె మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే చల్లూరు గ్రామంలో పీఏసీఎస్ మాజీ చైర్మన్ పెద్ది మల్లారెడ్డి తల్లి ప్రమీల, మామిడాలపల్లిలో రైతు బంధు సమన్వయ సమితి గ్రామ కన్వీనర్ మ్యాకల సత్తిరెడ్డి తల్లి రాజేశ్వరి ఇటీవల మృతి చెందారు. కాగా ఆ కుటుంబాలను సమ్మిరెడ్డి పరామర్శించారు. ఈ కార్యక్రమాల్లో సర్పంచ్ పంజాల అనూష-సతీష్, ఎంపీటీసీలు రాదారపు రామచంద్రం, మూల రజిత-పుల్లారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్లు నల్ల కొండల్ రెడ్డి, ఒడ్డెపల్లి కొమురయ్య, బీఆర్ఎస్వీ నాయకుడు ఆవుల తిరుపతి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

 

Spread the love