నవతెలంగాణ – హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మాజీ టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్రావు, సీఐ గట్టు మల్లును బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో విచారిస్తున్నారు. గట్టు మల్లు గతంలో ఎస్ఐబీలో సీఐగా పని చేశారు. ప్రణీత్రావుతో వీరికి ఉన్న సంబంధాలపై దర్యాప్తు బృందం ఆరా తీస్తోంది.