– సర్పంచ్ వడ్ల నవ్య శోభన్ బాబు, ఏపీడి శ్యామల
ఆలేరురూరల్: ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని సర్పంచ్ వడ్ల నవ్య శోభన్ బాబు, ఏపీడి శ్యామల అన్నారు. గురువారం మండలంలోని శ్రీనివాసపురం గ్రామంలో పర్యావరణహిత జీవనశైలి పై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు సాధ్యమైనంత వరకు పర్యావరణం కాలుష్యం కాకుండా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని తెలిపారు. గ్రామంలోని కాళ్ల కుంట చెరువులో పూడిక తీస్తున్న ఉపాధి హామీ కూలీలు, రైతులతో మాట్లాడారు. చెరువులో పూడిక తీస్తున్న తీరును పరిశీలించి చెరువు మట్టి రైతులు తమ యొక్క పొలంలో వేసుకున్నట్లయితే రైతులు యొక్క భూమి సారం పెరిగి అధిక దిగుబడి వస్తుందని పేర్కొన్నారు .ఈ కార్యక్రమంలో ఏపీవో వెంకట కిషన్ ,ప్రాజెక్టు మేనేజర్ ఆయిల్ ఆలీ, టెక్నికల్ అసిస్టెంట్ రామచంద్రయ్య చారి, పంచాయతీ కార్యదర్శి శ్రీలత ,ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాస్ రైతులు కూలీలు తదితరులు పాల్గొన్నారు.