వృత్తివిద్యా ఉపాధ్యాయుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పాఠశాల విద్యాశాఖ వృత్తి విద్యా ఉపాధ్యాయుల సంఘం (పీఆర్‌వీటీయూటీఎస్‌) నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా గొడిశల శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శిగా పోతిగంటి వెంకట్‌రెడ్డి తిరిగి ఎన్నికయ్యారు. సోమవారం హైదరాబాద్‌లో పీఆర్‌వీటీయూటీఎస్‌ సమావేశంలో పీఆర్టీయూటీఎస్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు, ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి పాల్గొన్నారు. వృత్తి విద్యా ఉపాధ్యాయులకు హైకోర్టు 1990, అక్టోబర్‌ 30 నుంచి సర్వీసును ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరిన విషయంపై జీవో ఇప్పిస్తామంటూ వారు చెప్పారు. వృత్తి విద్యా ఉపాధ్యాయులను స్కూల్‌ అసిస్టెంట్లుగా గుర్తించేందుకు ప్రయత్నిస్తామని రఘోత్తంరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా బలగం సినిమాలో నటించిన వృత్తి విద్యా ఉపాధ్యాయ సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు భిక్షమయ్యను సన్మానించారు.

Spread the love