– టీడపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్
నవతెలంగాణ-హైదరాబాద్
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ రోజురోజుకూ బలోపేతమవుతున్నదని తెలుగుదేశం అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. ఇందుకు ఎన్నికలే నిర్ల్యమని చెప్పారు.ఎన్నికల నోటిఫికేషన్ నాటికి టీడీపీలోకి వలసలు మరింత ఊపందుకు ంటాయని చెప్పారు. గురువారం ఎన్టీఆర్ భవన్లో పెద్దపల్లి జిల్లా వైఎస్సార్టీపీ యువజన అధ్యక్షుడు పలకల చంద్రారెడ్డి, వొదేల మండల యూత్ ప్రెసిడెంట్ కొలిపాక రాజు ముదిరాజ్కు కాసాని జ్ఞానేశ్వర్ తెలుగుదేశం కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు. వీరు తెలంగాణ ఐటీడీపీ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు హరికష్ణ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు మంచి జరగాలని టీడీపీలో చేరిన వైఎస్సార్టీపి నాయకులను అభినందించారు. తెలంగాణలో టీడీపీ రోజుకు రోజు బలపడుతు న్నదనీ, రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామన్నారు. గెలుపు దిశగా నాయకులు, కార్యకర్తలంతా సమిష్టిగా కషి చేయాలని సూచించారు. వేగంగా మారుతున్న తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ కీలకపాత్ర పోషించడం ఖాయమన్నారు. అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీల విధానాలపై ప్రజలు విసిగెత్తి ఉన్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య, అజ్మీరా రాజు నాయక్, రాష్ట్ర అధికార ప్రతినిధి ముప్పి డి గోపాల్, ఐటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు హరికష్ణ, ఎస్సీ సెల్ అధ్యక్షుడు పొలంపల్లి అశోక్, చేవెళ్ల పార్లమెంటు అధ్యక్షుడు సుభాష్యాదవ్, ప్రధాన కార్యదర్శులు వెంకట్ రెడ్డి, జగదీశ్రెడ్డి, మీర్ పేట్కార్పోరేటర్ మల్లేష్ ముదిరాజ్ పాల్గొన్నారు.