ఉద్యమ నాయకుడు జహంగీర్ ను ఎంపీగా గెలిపించండి

– సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు-నారి ఐలయ్య
నవతెలంగాణ – వలిగొండ రూరల్
ప్రజా ఉద్యమ నాయకుడు ఎండి జహంగీర్ ను భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా గెలిపించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు లు కోరారు. శుక్రవారం సుంకిశాల గ్రామంలోసీపీఐ(ఎం) ప్రచారంలో భాగంగా వ్యవసాయ మార్కెట్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిరంతరం ప్రజల పక్షాన పోరాటాలు నిర్వహిస్తున్న సీపీఐ(ఎం) భువనగిరి ఎంపీ అభ్యర్థి ఎండి జాంగిర్ ను ఈ ఎన్నికల్లో ఎంపీగా గెలిపించాలని ఎంపీగా గెలిస్తే నిరంతరం ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంటారన్నారు. అనేక సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారని రైతులకు గిట్టుబాటు ధర, వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ పనిని కల్పించే విధంగా పోరాటాల నిర్వహిస్తారని అందుకే ఈ ఎన్నికల్లో సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండి జహంగీర్ ను ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రజలతో ఏమాత్రం సంబంధంలేని అనేకమంది వివిధ రాజకీయ పార్టీల పేరుతో ఈ ఎన్నికల్లో ముందుకు వస్తున్నారని వారు ఏనాడు ప్రజల సమస్యలు పరిష్కారం కోసం పనిచేసిన పరిస్థితులు లేవని కేవలం వాళ్ల ఆస్తులను కాపాడుకోవడం వాటిని మరింత పెంచుకోవడం కోసం ఈ ఎన్నికల్లో ముందుకు వస్తున్న వారికి తగిన బుద్ధి చెప్పి ఓడించాలని  పిలుపునిచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో సీపీఐ(ఎం)మండల కార్యదర్శి సిర్పంగి స్వామి, మొగిలి పాక బొందయ్య, పోలేపల్లి వెంకయ్య,పోచమ్మ అలివేలు, రేణుక,పద్మమ్మ తదితరులు పాల్గొన్నారు.

Spread the love