మున్నూరు కాపు సంఘంలో జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయండి

– భారత జాతీయవాదుల ఉద్యమం నేషనల్ ప్రెసిడెంట్ కృష్ణ ప్రసాద్..
నవతెలంగాణ – డిచ్ పల్లి
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని శనివారం నిజామాబాద్ నగరంలోని మున్నూరు కాపు కళ్యాణ మండపం(ప్రగతి నగర్ ) లో జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని భారత జాతీయ వాదుల ఉద్యమం నేషనల్ ప్రెసిడెంట్ కృష్ణ ప్రసాద్,సిఎస్ డిఎఫ్  రాష్ట్ర కన్వీనర్ ప్రోఫెసర్ వినాయక రెడ్డి అన్నారు.శుక్రవారం డిచ్ పల్లి మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..బీజేపీ మోడీ ప్రభుత్వం గత  10 సంవత్సరాల నుండి ఈ దేశాన్ని పెట్టుబడిదారులైన ఆధాని,అంబానీలకు కట్టబెడుతున్నారని, హిందూ ముస్లిం మధ్య మతం పేరుతో రెచ్చగొడుతున్నారని ఆయన అన్నారు. కార్మిక, రైతు వ్యతిరేక మోడీ ప్రభుత్వాన్ని ఓడించలని ,రాజ్యాంగాన్ని రక్షించలని   పిలుపునిచ్చారు.ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజాస్వామ్య పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో తేదీ 27- 4- 2024 న జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్ మున్నూరు కాపు కళ్యాణ మండపంలో బహిరంగ సభ నిర్వహింస్తున్నామని ఈ సభ ను విజయవంతం చేయడానికి అధిక సంఖ్యలో ప్రజలు హాజరుకావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో న్యూడెమోక్రసీ నాయకులు జేపీ గంగాధర్ ,సాయినాథ్,దాసు,పిడిఎస్ యూ నాయకులు జన్నారపు రాజేశ్వర్, ప్రిన్స్ , నవీద్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love