రక్తదానానికి కదిలొచ్చిన యువకులు…

ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లాలో మూడు రైళ్లు ఢ కొన్న ఘటన వందలాది కుటుంబాల్లో పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ విపత్కర పరిస్థితుల్లో గాయపడిన వారికి రక్తం అవసరం ఉంటుందని ఆలోచించిన వందలాదిమంది యువకులు రాత్రికి రాత్రే బాలేశ్వర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. వీరంతా ఏ పిలుపూ లేకుండానే స్వచ్ఛందంగా ముందుకొచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు. గంటల తరబడి వేచి ఉండి మరీ.. క్షతగాత్రులకు రక్తదానం చేస్తున్నారు. అందించేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చి కొందరు స్థానికులు మానవత్వాన్ని చాటుకున్నారు. బహానగా బజార్‌ వద్ద జరిగిన ఈ దుర్ఘటనలో దాదాపు 300 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 1000 మందికి పైనే గాయ పడ్డారు. క్షతగాత్రులను బాలేశ్వర్‌ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రితో పాటు పలు సమీప ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదం జరిగిన తర్వాత స్థానికులు చాలా వేగంగా స్పందించారు. ఘటనాస్థలానికి వెళ్లి సహాయకచర్యలు చేపట్టారు. బోగీల్లో చిక్కుకున్న వారిని బయటకు తీయడానికి సహాయచర్యలు చేపట్టారు. ప్రమాదం గురించి తెలియగానే మేం వెంటనే అక్కడకు బయల్దేరాం. దాదాపు 200-300 మందిని కాపాడగలిగారు.

Spread the love