100% నవ్విస్తుంది : చిరు

100% laughs,.chiru‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’ సినిమా క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అని చిరంజీవి కితాబిచ్చారు. నవీన్‌ పోలిశెట్టి, అనుష్క శెట్టి కాంబినేషన్‌లో రూపొందిన చిత్రమిది. ఈ సినిమా చూసిన అనంతరం చిరంజీవి సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. ‘ఈ సినిమా చూశాను.. మొదటి నుంచి చివరి దాకా ఎంతగానో ఆకట్టుకున్న హిలేరియస్‌ ఎంటర్టైనర్‌. నేటి యువత ఆలోచనా విధానాన్ని రిఫ్లెక్ట్‌ చేస్తూ తీసుకున్న సరికొత్త కథాంశం. ‘జాతి రత్నాలు’కి రెట్టింపు ఎనర్జీని, వినోదాన్ని అందచేసిన నవీన్‌ పోలిశెట్టి, కొంచెం గ్యాప్‌ తర్వాత కనిపిస్తున్నా మరింత అందంగా, బ్యూటిఫుల్‌గా ఉన్న మనందరి ‘దేవసేన’, అనూష్క శెట్టిలు ఈ చిత్రానికి ప్రాణం పోశారు. ఫుల్‌ లెంగ్త్‌ ఎంటర్టైనర్‌ అవటంతో పాటు ఎమోషన్స్‌ని కూడా అద్భుతంగా మిక్స్‌ చేసి రక్తి కట్టించేలా రూపుదిద్దిన డైరెక్టర్‌ మహేశ్‌ బాబుని అభినందించాల్సిందే. ఈ చిత్రానికి తొలి ప్రేక్షకుడ్ని నేనే.. ఆ హిలేరియస్‌ మూమెంట్స్‌ ఎంత గానో ఎంజారు చేశాను. మరోసారి థియేటర్‌లో ప్రేక్షకులందరితోనూ ఎంజారు చేయాలన్న బలమైన కోరిక నాకు కలిగింది. మిస్‌ శెట్టి – మిస్టర్‌ పోలిశెట్టి వందశాతం ఆడియన్స్‌ని నవ్వుల బాట పట్టిస్తారనటంలో సందేహం లేదు’ అని ట్వీట్‌లో చిరంజీవి పేర్కొన్నారు.
ఈ చిత్రం ఈ నెల 7న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌కు రెడీ అవుతోంది.

Spread the love