200 కోట్ల కేసీఆర్ డబ్బును ఓడించింది నేను కాదు..ప్రజలు: సీతక్క

నవతెలంగాణ – ములుగు: ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస అభ్యర్థి సీతక్క ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతిపై 33700 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గెలుపు అనంతరం సీతక్క ఎక్స్ వేదికగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విజయం ప్రజలదని వ్యాఖ్యానించారు. 200 కోట్ల కేసీఆర్ డబ్బును ఓడించిందిన తాను కాదని, ప్రజలని పేర్కొన్నారు. ఎన్నికల తరువాత ములుగు నుంచి సీతక్క  మేడారానికి వెళ్లి సారలమ్మను దర్శించుకున్నారు. ఈ క్రమంలో అడుగడుగునా ఆమెకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కాగా, ఈ ఎన్నికల్లో సీతక్కకు 102267 పోలవగా బీఆర్ఎస్ నేత బడే నాగజ్యోతికి 68567 ఓట్లు వచ్చాయి.

Spread the love