బిఎన్కె ఎంటర్టైన్మెంట్స్లో ప్రొడక్షన్ నెం1గా రూపుదిద్దు కుంటున్న చిత్రం గురువారం ప్రముఖుల సమక్షంలో పూజా కార్యక్రమాలతో గ్రాండ్గా ప్రారంభ మైంది. మనోజ్ ఎల్లుమహంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో ప్రదీప్ విరాజ్ హీరోగా పరిచయం అవుతుండగా, ఆయన సరసన దివ్య ఖుష్వా హీరోయిన్గా నటించనుంది. లవ్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని బిఎన్కె (బంగారు నవీన్ కుమార్) భారీ బడ్జెట్తో నిర్మించనున్నారు. ఈ చిత్ర ముహుర్తపు సన్నివేశానికి నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా క్లాప్ కొట్టగా, దర్శకుడు వి.సముద్ర కెమెరా స్విచ్చాన్ చేశారు. వ్యాపార వేత్త రామ్ ఎర్రమ్ స్క్రిప్ట్ని చిత్ర యూనిట్కు అందించారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రం గురించి నిర్మాత బిఎన్కె మాట్లాడుతూ,’ దర్శకుడు మనోజ్ చెప్పిన మంచి కథతో ఇండిస్టీకి పరిచయం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయన కథ చెప్పిన విధానం ఎంతగానో నచ్చింది. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి. అందుకే బడ్జెట్ విషయంలో రాజీ పడ కుండా నిర్మించనున్నాం. మంచి క్యాస్ట్ అండ్ క్రూని దర్శకుడు సెలక్ట్ చేస్తున్నారు. మా బ్యానర్ నుంచి వస్తున్న ఈ మొట్టమొదటి చిత్రం ఘన విజయం సాధిస్తుందని నమ్ముతున్నాం’ అని అన్నారు. ‘క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ప్రతీ సీన్ ఉత్కంఠతను కలిగించేలా ఈ సినిమా ఉంటుంది. నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత బిఎన్కెకి ధన్యవాదాలు. ఆయన నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేస్తాం’ అని దర్శకుడు మనోజ్ తెలిపారు.ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: పంకజ్ తట్టోడ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ప్రసన్న ఆంజనేయులు, స్టోరీ, స్క్రీన్ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: మనోజ్ ఎల్లుమహంతి.