ప్రజలకు, ప్రభుత్వానికి వారధి జర్నలిస్టు

– టీడబ్ల్యుజేఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు టీవీ.రాజుగౌడ్‌
నవతెలంగాణ-ధర్మసాగర్‌
కెమెరా అన్నది ప్రజల కు ప్రభుత్వానికి వారిది జర్నలిస్టుల పాత్ర ఎంతో గొ ప్పదని టియు డబ్ల్యూజేఎఫ్‌ హనుకొండ జిల్లా అధ్యక్షులు టీవీ.రాజ్‌గౌడ్‌ అన్నారు. మండల కేంద్రంలో ప్రింట్‌ మీడియా అసోసియేషన్‌ ధ ర్మసాగర్‌ మీడియా పాయిం ట్‌ ప్రారంభోత్సవం ఆ మీడియా పాయింట్‌ అధ్యక్షులు పోలుమారి గోపాల్‌ అధ్యక్షతన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి టీవీ రాజు గౌడ్‌ ముఖ్య అతిథిగా యూనియన్‌ ఆఫీస్‌ ప్రారంభించి మాట్లాడుతూ పాత్రికేయ వత్తి కత్తిమీది సాము లాంటిదని అన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా వ్యవహరించడంలో వారు ఎలాంటి ప్రలోభాలకు లంగకుండా పత్రికల్లో ప్రచురించడం వల్ల ప్రభుత్వానికి ఇటు ప్రజలకు చాలా సందర్భాలలో ఎన్నో కష్టాలను నష్టాలను అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. ఒకరికి న్యాయం చేస్తే మరోకరికి పరోక్షంగా శత్రువులుగా మరి వ్యతిరేక దిశలో పని చేసినారు అనే సందర్భంలో అనేక విలేకరులు తమ ప్రాణాలను సహితం కోల్పోయిన సందర్భాలు కో కుళ్ళలుగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వత్తిలో కొనసాగుతున్న సహచర విలేకరులు కొన్ని సందర్భాలలో పోలీసులకు, ప్రజా ప్రతినిధులకు, అధికారులకు సహితం నిజాన్ని నిర్భయంగా చెప్పినారనే సందర్భాలలో వారి నుండి అనేక దాడులను ఎదుర్కొన్న సంబంధాలు చెప్పకనే చెప్పవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పిట్టల శ్రీలత, ఎంపీటీసీలు సర్పంచి కురుసపల్లి నవ్య ప్రవీణ్‌,బొడ్డు శోభ సోమయ్య, రోండీ రాజు యాదవ్‌, కొలి పాక వనమాల, సీఐ శ్రీధర్‌రావు, బొడ్డు ప్రభుదాస్‌, మాజీ జెడ్పిటిసి బోర్డు వాసుదేవ్‌, ఏలుకుర్తి సర్పంచ్‌ మాదాసి అరుణ యాదగిరి,ఏలుకుర్తి గ్రామ శాఖ అధ్యక్షులు బేర మధుకర్‌, గుర్రపు ప్రసాద్‌, మహిళ మండలి అధ్యక్షురాలు ముట్టే యామిని, మాజీ ఎంపీటీసీ అంకం రాజమణి, మాజీ ఎంపీటీసీ మాజీ ఉప సర్పంచ్‌ రావుల వెంకటరెడ్డి, పిఎసిఎస్‌ డైరెక్టర్‌ బొడ్డు లెనిన్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love