బంగారాన్ని ఎగజిమ్ముతున్న అగ్ని పర్వతం…

నవతెలంగాణ హైదరాబాద్: అంటార్కిటికాలోని Mount Erebusమౌంట్‌ ఏర్‌బస్‌ అనే అగ్ని పర్వతం ప్రతిరోజూ 80 గ్రాముల బంగారాన్ని చిమ్ముతున్నట్టు పరిశోధకులు తెలిపారు. కొన్ని వాయువులు, లావాతో కలిపి పుత్తడిని వెదజల్లుతున్నట్టు వెల్లడించారు. 1972 నుంచి ఇప్పటివరకూ ఈ అగ్నిపర్వతం నుంచి సుమారు 1518 కిలోల బంగారు రేణువులు ధూళి రూపంలో వాతావరణంలోకి చేరినట్టు పేర్కొన్నారు. అగ్ని పర్వతం కింద బంగారు గని ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

Spread the love