టీడీపీ ఎంపీ అభ్యర్థికి తృటిలో తప్పిన ప్రమాదం

నవతెలంగాణ – ధర్మవరం: హిందూపురం పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థి పార్థసారధికి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అనంతపురం నుండి మడకశిరకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పార్థసారధి ప్రయాణిస్తున్న ఫార్చునర్‌ వాహనం చెన్నేకొత్తపల్లి మండల కేంద్రానికి సమీపానగల ఎన్‌ హెచ్‌ 44 వద్ద ఉన్న హెచ్‌పి పెట్రోల్‌ బంక్‌ వద్ద ఐచర్‌ వాహనం బ్రేక్‌ వేయడంతో వెనుక వైపు వస్తున్న పార్థసారథి ప్రయాణిస్తున్న ఫార్చునర్‌ వాహనం ఢీకొంది.  ఈ ఘటనలో బీకే పార్థసారధి సురక్షితంగా బయటపడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love