భారత్‌ ఒక్కరోజే మూడు స్వర్ణాలు

నవతెలంగాణ -హైదరాబాద్: ఆర్చరీ వరల్డ్‌ స్టేజ్‌-1 టోర్నీలో భారత్‌ మహిళల, పురుషుల జట్టు, కౌంపౌండ్‌ మిక్స్‌ డ్‌ టీంలో భారత్‌ పతకాలు సాధించింది. కౌంపౌండ్‌ మిక్స్‌ డ్‌ టీంలో సురేఖ- అభిషేక్‌ వర్మ జోడీ ఫైనల్‌లో విజయం సాధించింది. ఫైనల్‌లో 158-157 తేడాతో ఎస్తోనియా టీంపై గెలుపొందింది. పురుషుల టీం ఈవెంట్‌లో అభిషేక్‌ వర్మ, ప్రియాన్ష్‌, ప్రథమేశ్‌తో కూడిన జట్టు నెదర్లాండ్‌ టీంపై 238- 231 తేడాతో స్వర్ణం సాధించింది. మహిళల జట్టు విభాగంలో ఇటలీకి చెందిన టీమ్‌పై భారత్‌ అమ్మాయిలు స్వర్ణం గెలిచారు. ఇటలీ ఆర్చర్లు మార్సెల్లా టినిలి, ఐరెనె ఫ్రాంచిని, ఎలీసా రోనెర్‌పై.. 236-225 తేడాతో వెన్నం జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్నీత్‌ కౌర్‌తో కూడిన టీమిండియా ఘన విజయం సాధించారు.

Spread the love