ప్రభుత్వాసుపత్రిలో నర్సుల కాన్పు వికటించి నవజాత శిశువు మృతి

నవతెలంగాణ – కోదాడ: డాక్టర్‌ ఆస్పత్రికి రాలేదని నర్సులు చేసిన కాన్పు వికటించడంతో నవజాత శిశువు మృతిచెందింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ ప్రభుత్వాసుపత్రిలో చోటుచేసుకుంది. బంధువులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నడిగూడెం మండలం వెంకట రామాపురానికి చెందిన మానసకు కాన్పుకోసం ఆస్పత్రిలో చేర్చారు. మంగళవారం తెల్లవారుజామున మానసకు నొప్పులు రావడంతో అక్కడికి సిబ్బంది వైద్యురాలికి సమాచారం అందించారు. ఆమె రాలేనని చెప్పడంతో నర్సులే నిర్లక్ష్యంగా కాన్పు చేశారు. శిశువుకు ప్రమాదంగా ఉందని.. ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాలని హడావుడి చేశారు. ప్రభుత్వాసుపత్రిలో చిన్న పిల్లల వైద్యులు కూడా అందుబాటులో లేకపోవడం.. అంబులెన్స్‌ డ్రైవర్‌ కూడా ప్రైవేట్‌ ఆస్పత్రికి రానని చెప్పడంతో శిశువు మృతిచెందినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.బంధువులు ఆరోపిస్తున్నారు..తమకు న్యాయం చేయాలని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Spread the love