హీరో ఆనంద్ దేవరకొండ తాజాగా నటిస్తున్న చిత్రం ‘గం..గం..గణేశా’. ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్గా నటిస్తున్న ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదరు శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆనంద్ దేవరకొండ తన కెరీర్లో చేస్తున్న ఫస్ట్ యాక్షన్ మూవీ ఇది కావడం విశేషం. ఈ నెల 31న ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని సెకండ్ సింగిల్ ‘పిచ్చిగా నచ్చాశావే’ను మల్లారెడ్డి కాలేజ్ విద్యార్థుల సందడి మధ్య రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత వంశీ కారుమంచి మాట్లాడుతూ, ‘మీ అందరినీ చూస్తుంటే నేను చెన్నైలో చదువుకున్న రోజులు గుర్తొస్తున్నాయి. ఆనంద్ దేవరకొండ మంచి ఫ్రెండ్, రియల్ లైఫ్లోనూ హీరో. ఈ సినిమాలో ఆనంద్ క్యారెక్టర్ మీ రియల్ లైఫ్లో ఫ్రెండ్ క్యారెక్టర్లా ఉంటుంది. ఈనెల 31న మీ ముందుకు వస్తున్నాం. మూవీని తప్పకుండా చూడండి’ అని తెలిపారు. ‘ఇదొక మంచి క్రైమ్ కామెడీ మూవీ. మీరు మీ ఫ్యామిలీస్తో కలిసి ఎంజారు చేసేలా సినిమా ఉంటుంది. మా మూవీని మిస్ కాకండి’ అని దర్శకుడు ఉదరు శెట్టి చెప్పారు. హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ, ”బేబి’ సినిమాలో ఎంత ఏడ్చారో ఈ సినిమాలో నన్ను చూసి అంత నవ్వుతారు. స్క్రిప్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ట్విస్ట్స్, టర్న్స్ ఉంటాయి. క్రైమ్, కామెడీ, యాక్షన్తో మీరంతా ఈ మూవీని బాగా ఎంజారు చేస్తారు’ అని అన్నారు.