జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను ‘రాజు యాదవ్’తో హీరోగా ఆరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కష్ణమాచారి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై కె. ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ను నిర్మించారు. ఈనెల 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. హీరో తేజ సజ్జా ముఖ్య అతిధిగా హాజరై ట్రైలర్ని లాంచ్ చేశారు. హీరో గెటప్ శ్రీను మాట్లాడుతూ,’దర్శకుడు కష్ణమాచారి ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఉదరు చాలా మంచి విజువల్స్ ఇచ్చారు. హర్షవర్ధన్ రామేశ్వర్ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. సురేష్ బొబ్బిలి అద్భుతమైన నేపథ్య సంగీతం అందించారు. నిర్మాత ప్రశాంత్ చాలా ప్యాషన్తో ఈ సినిమా చేశారు’ అని అన్నారు. ‘ఈ సినిమా ఒక రియల్ స్టొరీ. చాలా సహజసిద్ధంగా ఈ సినిమాని తీశాం. ప్రేక్షకులు కొత్త అనుభూతి వుంటుంది. ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ ఆకట్టుకుంటాయి. ఈనెల 17న అందరూ రాజు యాదవ్ చూసి, సినిమాని పెద్ద హిట్ చేయాలి. ఫ్యామిలీ అంతా కలసి చూసే సినిమా ఇది’ అని దర్శకుడు కష్ణమాచారి చెప్పారు.