ఒకేసారి రెండు సినిమాలు షూరు

ఒకేసారి రెండు సినిమాలు షూరు‘డైరెక్టర్స్‌ డే’ సందర్భంగా ఇద్దరు కొత్త దర్శకులను పరిచయం చేస్తూ ఈస్ట్‌ వెస్ట్‌ ఎంటర్టైనర్స్‌ సమర్పణలో రెండు సినిమాల షూటింగ్స్‌ ప్రారంభం అయ్యాయి. హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్స్‌లో ఖుషి టాకీస్‌ బ్యానర్‌ పై ‘సీత ప్రయాణం కష్ణతో’ అనే చిత్రం, మహీ మీడియా వర్క్స్‌ బ్యానర్‌ పై ‘త్రిగుణి’ చిత్రం లాంఛనంగా ముహూర్తం షాట్‌తో మొదలయ్యాయి. ఈ రెండు చిత్రాల ముహూర్తం షాట్స్‌కి తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్‌ కెమెరా స్విచ్‌ ఆన్‌ చేయగా, దర్శకులు దాసరి మారుతి తొలి క్లాప్‌ కొట్టారు.
ఆ తర్వాత ఈ రెండు చిత్రాల తొలి పోస్టర్లను లాంచ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో విరాట పర్వం దర్శకుడు వేణు ఉడుగుల, తెలుగు నిర్మాతల మండలి కార్యదర్శి టి.ప్రసన్నకుమార్‌, డార్లింగ్‌ స్వామి, రుద్రాపట్ల వేణుగోపాల్‌, రామ్‌ రావిపల్లి తదితరులు పాల్గొన్నారు.
ఆద్యంతం కడుపుబ్బ నవ్వించే సన్నివేశాలతో నడిచే ఫ్యామిలీ డ్రామా కథాంశంతో రానున్న ‘సీత ప్రయాణం కష్ణ’తో అనే సినిమాలో నాయకానాయికలుగా రోజా ఖుషి, దినేష్‌ నటిస్తున్నారు. వీరితో పాటు అనుపమ, సుమంత్‌, వైభవ్‌ తదితరులు నటిస్తున్నారని దర్శకుడు దేవేందర్‌ చెప్పారు. ‘త్రిగుణి’ సినిమాలో హీరోగా కుషాల్‌, ఒక ప్రత్యేక పాత్రలో రోజా ఖుషి నటిస్తుండగా, మిగిలిన పాత్రలకు అందరూ కొత్త నటీనటులనే పరిచయం చేస్తున్నామని చిత్ర దర్శకుడు వైతహవ్య వడ్లమాని తెలిపారు. సీత ప్రయాణం కష్ణతో చిత్రానికి సినిమాటోగ్రఫీ:రవీంద్ర, సంగీతం: హనుమాన్‌త్సవటపల్లి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: చెర్రీ, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: రుద్రపట్ల వేణుగోపాల్‌, చీఫ్‌ అడ్వైజర్‌: రామ్‌ రావిపల్లి, నిర్మాత: రోజా భారతి, డైరెక్టర్‌ : దేవేందర్‌. త్రిగుణి చిత్రానికి సినిమాటోగ్రఫీ:సలీం, సంగీతం: హనుమాన్‌ త్సవటపల్లి, నిర్మాత: మహేశ్వరి, కథ: వంశీ, డైరెక్టర్‌ : వైతహవ్య వడ్లమాని.

Spread the love