ధీక్షిక సమర్పణలో మ్యాక్వుడ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై మణి సాయితేజ, వైడూర్య, పవన్ వర్మ రేఖ తారాగణంగా ఆర్.కె. గాంధీ దర్శకత్వంలో కొండ్రాసి ఉపేందర్ నిర్మిస్తున్న చిత్రం ‘రుద్రాక్షపురం 3 కి.మీ.’ పక్కా యాక్షన్ థ్రిల్లర్గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ముగించుకుని, విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా హీరో వెంకట్ ఈ చిత్ర టీజర్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు ఆర్.కె. గాంధీ మాట్లాడుతూ, ‘వెంకట్ బిజీగా ఉండటంతో ఆయన చేయాల్సిన ఓ మెయిన్ రోల్ని సురేష్ కొండేటి చేశారు. జూన్ 23న రిలీజ్కి ప్లాన్ చేస్తున్నాం’ అని తెలిపారు. ఈ సినిమా కోసం గాంధీగారు చాలా కష్టపడ్డారు. మంచి అవుట్ఫుట్ వచ్చింది. ఈ సినిమాతో మా అబ్బాయి హీరోగా అందరి ప్రశంసలను సొంతం చేసుకుంటాడు’ అని నిర్మాత కొండ్రాసి ఉపేందర్ అన్నారు. హీరో సాయి మణితేజ మాట్లాడుతూ,’ఇందులో చాలా మంచి పాత్ర ఇచ్చి ఎంకరేజ్ చేసిన దర్శకుడు గాంధీకి ధన్యవాదాలు’ అని తెలిపారు.