విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు

నవతెలంగాణ-పెద్దకొడప్ గల్
విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని ఏడీఏ నూతన్ కుమార్ ఎరువుల దుకాణదారులకు హెచ్చరికలుచేశారు. మండలంలోని ఎరువుల దుకాణాను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీచేశారు. అందులో భాగంగా స్టాక్‌రికార్డులు, లైసెన్సు, సాక్ట్‌నిల్వలను పరిశీలించారు. దుకాణదారులుధరలబోర్డునురైతులకుకనపడేలా ఏర్పాటు చేయాలన్నారు. వ్యవసాయశాఖ అనుమతి పొందిన ఎరువులను మాత్రమే విక్రయించాలన్నారు. రైతులకు బిల్లులు తప్పక ఇవ్వాలన్నారు. కాలం చెల్లిన మందులను గుంతలో వేసి పూడ్చిపెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలోఏవో నదిముద్దీన్, సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love