పూర్వపు విద్యార్థుల ఆర్థిక సహయం

నవతెలంగాణ- రుద్రంగి:  రుద్రంగి మండల కేంద్రానికి చెందిన కొమిరె రాజమణి అనే మహిళ నిరుపేద కుటుంబం కావడంతో ఆమేతో కలిసి చదువుకున్న 1989-90 బ్యాచ్ పూర్వపు విద్యార్థులు బుధవారం రూ.25 వేలు ఆర్థిక సహాయం అందజేసి మానవత్వం చాటుకున్నారు. ఈ సందర్భంగా పూర్వపు విద్యార్థులు మాట్లాడుతూ.మా తోటి చదువుకున్న రాజమణి భర్త మహేష్ గత సంవత్సరం క్రితం మరణించడంతో రాజమణి పరిస్థితి ధీనంగా మారిందని,ఈ విషయం తెలుసుకున్న మా తోటి మిత్రులం కలిసి రాజమణి కి ఆర్థిక సహాయం చేసామన్నారు. భవిష్యత్తులో కూడ రాజమణికి అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేక్. వెంకటేష్, మంచే గంగాదర్, ఎల్లాల నర్సారెడ్డి, మాడిశెట్టి శివకుమార్, కట్కూరి శంకర్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
Spread the love