ముళ్ల పొదల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. తృటిలో తప్పిన ప్రమాదం

నవతెలంగాణ – హైదరాబాద్‌ : ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ముళ్ల పొదల్లోకి దూసుకెళ్లిన సంఘటన కామారెడ్డి జిల్లాలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆర్టీసీ బస్సు బాన్సువాడ నుంచి పిట్లం వస్తుండగా కుర్తిగేట్‌ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న ముళ్ల పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. తఅటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Spread the love