శంకర్‌పల్లిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

నవతెలంగాణ-శంకర్‌పల్లి
శంకర్‌పల్లి గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాం లభ్యమైంది. ఈ ఘటన సంగారెడ్డి రూట్‌లోని పతేపురం సమీపంలో ముప్పావెంచర్‌ వెనుక భాగంలో గురువారం చోటు చేసుకుంది. శంకర్పల్లి సీఐ ప్రసన్నకుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం ఎవరో చూసి తమకు సమాచారం అందించడంతో ఎస్‌ఐ కృష్ణ, కానిస్టేబుల్‌తో కలిసి ఘటనా స్థలానికి చేరుకోగా, గుర్తుతెలియని ఒ వ్యక్తి సుమారు 40 నుంచి 45 ఏండ్ల మధ్య ఉంటాడనీ, మృతదేహాం ఎండకు పూర్తిగా మాడిపోయి గుర్తించలేని స్థితిలో ఉందన్నారు. ఇతను తిండి లేక మృతి చెందవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. సుమారు వారం పది రోజుల క్రితం మృతి చెంది ఉండవచ్చని పోలీసులు తెలిపారు. ఎక్కడినుండో భిక్షా టన చేసుకుంటూ ఇక్కడ వచ్చి ఉండవచ్చని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Spread the love