‘సీపీఐ ప్రజా గర్జన సభ’ వాల్‌పోస్టర్‌ ఆవిష్కరణ

నవతెలంగాణ-శంకర్‌పల్లి
4న కొత్తగూడెంలో ‘సీపీఐ ప్రజా గర్జన సభ’ ను విజయవంతం చేయాలని సీపీఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.ప్రభులింగం పిలుపునిచ్చారు. గురువారం శంకర్పల్లి మండల కేంద్రంలో తహసీల్దార్‌ కార్యాలయం సమీపంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రభులింగం, సీపీఐ మండల కార్యదర్శి పి.సుధీర్‌, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నాని చంద్రయ్య, సీపీఐ నాయకులు గంగయ్య, నరసింహులు ఆధ్వర్యంలో వాల్‌ పోస్టర్‌, కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 4న కొత్తగూడెంలో నిర్వహించే సీపీఐ ప్రజా గర్జన బహిరంగ సభకు, సీపీఐ జాతీయ నాయకులు డి.రాజా, నారాయణ, చాడ వెంకటరెడ్డి, సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు పాల్గొననున్నట్టు తెలి పారు. చేవెళ్ల నియోజవర్గం నుంచి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని కోరారు. జాతీయ కమిటీ పిలుపుమేరకు ఏప్రిల్‌ 14 నుంచి మే 15 వరకు మోడీ కో హటావో దేశ్‌ కో బచావో కార్యక్రమంలో భాగంగా గ్రామగ్రామాన తిరిగి ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రచారం చేస్తున్నట్టు తెలిపారు.ఈ నేపథ్యంలో ముగింపు సమావేశం కొత్తగూడెంలో నిర్వహిస్తున్న సభను ప్రతి ఒక్కరూ పాల్గొన్ని జయప్రదం చేయాలని కోరారు.

Spread the love