నవతెలంగాణ-మిర్యాలగూడ
మంచితనానికి మారు పేరు ఏఎస్ఐ నాగేశ్వర్రావు అని డీఎస్పీ మొగులయ్య అన్నారు. పొక్కుల నాగేశ్వరరావు రిటైర్డ్ ఏఎస్ఐ దశదిన కర్మకు హాజరై మాట్లాడారు. స్నేహానికి మంచితనానికి మారుపేరుగా ఉద్యోగరీత్యా అధికారుల నుండి ప్రజల నుండి మన్ననలు పొందారని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో షెడ్యూల్ కులాల ఉద్యోగుల సంక్షేమ సంఘం డివిజన్ అధ్యక్షులు మాడుగుల శ్రీనివాస్, నాగేశ్వర్రావు కుమారుడు పొక్కుల పవన్ కుమార్, ఎస్సీ ఉద్యోగుల సంక్షేమ సంఘం డివిజన్ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి బాబురావు, ఎస్సీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు గుడిపాటి శ్రీరాములు, పేరపాక కృష్ణ, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు అంబటి సోమన్న, సామాజిక ఉద్యమ నాయకులు పోలేపల్లి రాము తదితరులు పాల్గొన్నారు.