నవతెలంగాణ-హైదరాబాద్ : రాజస్థాన్లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక 19 ఏండ్ల విద్యార్థిని బలవన్మరణం చెందింది. ఉత్తరప్రదేశ్లోని లక్నోకు చెందిన సౌమ్య.. ఓ హాస్టల్ ఉంటూ నీట్ పరీక్షకు సన్నద్ధమవుతున్నది. ఈ క్రమంలో హాస్టల్లోని తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. దీంతో రెండు రోజుల్లోనే ఇద్దరు చనిపోయినట్లయింది. మొత్తంగా కోటాలో ఈ ఏడాది ఇది ఎనిమిదో ఆత్మహత్య. కాగా, ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని, వారు కోటాకు వచ్చిన తర్వాత పోస్టుమార్టం నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు.