నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణలోని బీసీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాల కోసం నిర్వహిచిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి గంగుల కమలాకర్ ఫలితాలను విడుదల చేశారు. ఎంపీసీలో సిద్దిపేట జిల్లాకు చెందిన పి.జ్యోత్స్న 122 మార్కులతో తొలి ర్యాంక్ సాధించింది. బైపీసీలో నల్గొండ జిల్లాకు చెందిన పి.శ్రీవల్లి, 108 మార్కులతో తొలి ర్యాంక్ కొట్టేసింది. సీఈసీలో పెద్దపల్లి జిల్లాకు చెందిన కె.సాయి సంహిత (107 మార్కులు), ఎంఈసీలో మేడ్చల్ జిల్లాకు చెందిన ఎ.అర్చన (109 మార్కులు) తొలి స్థానంలో నిలిచారు. https://mjptbcwreis.telangana.gov.in వెబ్సైట్లో ఫలితాలు అందుబాటులో ఉంటాయని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. జూన్ 1 నుంచి 10వ తేదీ వరకు గురుకుల కళాశాలల్లో చేరేందుకు గుడువు విధించినట్లు తెలిపారు.