నవతెలంగాణ-హైదరాబాద్ : ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ భారీ స్కోర్ చేసింది. అయితే భారీ టార్గెట్ చేదనలో భరిలోకి దిగింది చెన్నై సూపర్ కింగ్ అయితే మూడు బంతులు పడగానే వర్షం ప్రారంభం అయ్యింది. దీంతో మ్యాచ్ ఆగిపోయింది. వర్షం తగ్గకా మళ్లీ మ్యాచ్ ప్రారంభం కానుంది. నిన్న ఎకదాటిగా వర్ష కురువడంతో మ్యాచ్ నేటి వాయిదా వేశారు. కాగా నేడు తొలి ఇన్నింగ్స్ పూర్తి అవ్వగా రెండో ఇన్నింగ్స్ మొదలు కాగానే వర్షం అడ్డు పడింది. మరి ఇవాళ వర్షం తగ్గి మ్యాచ్ కొనసాగుతుందా.. లేదా మళ్లీ రద్దు అవుద్దా అనేది చూడాలి. తొలి ఇన్నింగ్స్ గుజరాత్ 214 పరుగులు చేసింది. 215 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది చెన్నై.