– 1,12 తరగతుల విద్యార్థులకు రెండు భాషలు తప్పనిసరి
– అందులో ఒకటి దేశీయ, మరొకటి విదేశీ భాష
– ఎన్సీఈఆర్టీ తుది పాఠ్యప్రణాళిక ఫ్రేమ్వర్క్ విడుదల
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
11, 12 తరగతుల విద్యార్థులకు రెండు భాషలు తప్పనిసరి అని ఎన్సీఈఆర్టీ జాతీయ పాఠ్యప్రణాళిక స్పష్టం చేసింది. ఈ మేరకు ఎన్సి ఈఆర్టి బుధవారం తుది జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్వర్క్ (ఎన్సీఎఫ్) విడుదల చేసింది. ఎన్సీఎఫ్ బోర్డు పరీక్షలను సంవత్సరానికి రెండుసార్లు నిర్వహించాలని సిఫారసు చేసింది. సైన్స్, కామర్స్ వంటి స్ట్రీమ్లలోని సబ్జెక్టులను విద్యార్థులు ఎంచుకోవడా నికి ఎటువంటి పరిమితి ఉండకూడదని పేర్కొంది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మాజీ చైర్మెన్ కె కస్తూరిరంగన్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన జాతీయ స్టీరింగ్ కమిటీ రూపొందించిన ఎన్సీఎఫ్ జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) 2020కి అనుగుణంగా ఉంది. ఎన్ఈపీ భారతీయ భాషలు బోధనపై ఉద్ఘాటించింది. వాటిని పాఠశాల, ఉన్నత విద్యలో బోధనా మాధ్యమంగా అందిస్తోంది.
ఎన్సీఎఫ్ 3 నుంచి 12 తరగతులలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ)కి అనుబంధంగా ఉన్న పాఠశాలల్లో బోధించే ఎన్సీ ఈఆర్టీ పాఠ్యపుస్తకాల కోసం బెంచ్మార్క్ లను నిర్వచిస్తుంది. బోధన, అభ్యాస పద్ధతులు, పాఠశాల లు అనుసరించే మూల్యాంకన పద్ధతులను నిర్వచి స్తుంది. ఏది ఏమైనప్పటికీ, విద్య అనేది రాష్ట్ర సబ్జెక్ట్ అయినందున రాష్ట్ర విద్యా బోర్డులకు సిఫారసుగా ఉంటాయి. ఎన్సీఎఫ్ చివరిగా 2005లో సవరించారు.
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) ప్రజా సంప్రదింపుల కోసం ఏప్రిల్లో ఎన్సీఎఫ్ ముందస్తు ముసాయిదా ను విడుదల చేసింది. చివరి ఎన్సీఎఫ్ డ్రాఫ్ట్లో చేర్చిన చాలా సిఫారసులను ఉన్నాయి. కొన్ని మార్పు లు కూడా ఉన్నాయి. 11, 12 తరగతుల విద్యార్థు లకు కనీసం రెండు భాషలను అందించాలన్న ఎన్సీఎఫ్ సూచన, వాటిలో ఒకటి భారతీయ భాష తప్పని సరి అని పేర్కొంది.
అందించే భాష, సాహిత్య కోర్సుల నుంచి విద్యార్థులు భాషలను ఎంపిక చేసుకుంటారు. భాషల ఎంపికలలో సాంప్రదాయ తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, ఒరియా, పాలీ, పర్షియన్, ప్రాకృతంతో సహా సంస్కృతం, ఇతర ఆధునిక, క్లాసికల్ భాషలు, భారతదేశ సాహిత్యం ఉంటాయి. దీనితో పాటు, ఫ్రెంచ్, జర్మన్, జపనీస్, కొరియన్ వంటి విదేశీ భాషలు కూడా అందించబడతాయి.
ప్రస్తుతం సీబీఎస్ఈ పాఠశాలల్లో 11, 12 తరగతుల విద్యార్థులకు ఒకే భాష బోధిస్తున్నారు. దీని అర్థం ఈ తరగతుల్లో ఒక భాష అదనంగా మరో సబ్జెక్ట్ పెరుగుతుంది. ”ఈ భాషలు, సాహిత్యాలు సజీవంగా, చైతన్యవంతంగా ఉండేలా చూడటం కోసం, ప్రత్యేకించి ఉత్తమంగా బోధన, పెంపొందిస్తుంది” అని ఫ్రేమ్వర్క్ పేర్కొంది.
”12వ తరగతి వరకు ఉన్న విద్యార్థులందరికీ బోధనా మాధ్యమం కోసం దేశానికి చెందిన కనీసం ఒక భాష ఎంపిక చేయబడుతుంది” అని కూడా ఫ్రేమ్వర్క్ నొక్కి చెప్పింది. ఇటీవల, సీబీఎస్ఈ పాఠశాలలను భారతీయ భాషలను బోధనా మాధ్యమంగా అందించాలని కోరింది.
విద్యార్థులు మంచి పనితీరు కనబరిచేందుకు తగిన సమయం, అవకాశం ఉండేలా ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలను నిర్వహించాలని ముసాయిదాలో ప్రతిపాదించిన సిఫారసును కూడా ఫ్రేమ్వర్క్ నిర్ధారిస్తుంది. ఇది 11, 12 తరగతులకు సెమిస్టర్ విధానాన్ని సిఫారసు చేసింది. ”కళలు, మానవీయ శాస్త్రాలు, శాస్త్రాల మధ్య ఎటువంటి విభజన లేదు” అని పేర్కొంది. ”దీర్ఘకాలంలో, అన్ని (విద్య) బోర్డులు సెమిస్టర్ లేదా టర్మ్-ఆధారిత వ్యవస్థలకు మారాలి. విద్యార్థులు ఒక సబ్జెక్ట్ను పూర్తి చేసిన వెంటనే మరొక సబ్జెక్ట్లో పరీక్షించవచ్చు. ఇది ఏదైనా ఒక పరీక్షలో పరీక్షించబడే కంటెంట్ లోడ్ను మరింత తగ్గిస్తుంది” అని ఫ్రేమ్వర్క్ తెలిపింది.