కుల గణనలో జనగణన చేపట్టాలి

– ఆ నిర్ణయం పై బీసీ సంఘాల హర్షం
– ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేని కలిసిన బీసీ నేతలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
బెంగళూరులో 26 పార్టీ నేతలు నిర్వహించిన భారత జాతీయ ప్రజాస్వామ్య సమ్మిళిత కూటమి సమావేశంలో తీసుకున్న జనగణన చేపట్టాలనే నిర్ణయంపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు గురువారం నాడిక్కడ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేని బీసీ సంఘం నేతలు కలిశారు. పార్లమెంటులో బీసీ బిల్లు కోసం, బీసీల వివిధ డిమాండ్లపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఖర్గేని కలిసిన వారిలో రాజ్యసభ సభ్యులు ఆర్‌. కృష్ణయ్య నాయకత్వంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘ కన్వీనర్‌ గుజ్జ కృష్ణ, అధికార ప్రతినిధి, ఢిల్లీ ఇన్‌చార్జి కర్రి వేణుమాధవ్‌, నందగోపాల్‌, రాజ్‌ కుమార్‌, బాషయ్య తదితరులు ఉన్నారు.

Spread the love