కారుణ్య నియామకాల కోసం

– 1,266 పోస్టుల అప్‌గ్రేడ్‌
– ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కారుణ్య నియామకాల కోసం వివిధ శాఖల్లో ఉన్న1,266 ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టులను అప్‌గ్రేడ్‌ చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విధుల్లో ఉండగా మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యుల కారుణ్య నియామకాలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 1,266 దరఖాస్తులు వచ్చాయి. వీరికి పోస్టింగ్‌ ఇచ్చేందుకు వీలుగా ప్రస్తుతమున్న ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టులను సూపర్‌ న్యూమరరీ కింద జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులుగా ప్రభుత్వం అప్‌గ్రేడ్‌ చేసింది. ఈ మేరకు గురువారం ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల వారీగా జాబితాను విడుదల చేసింది. ఈ పోస్టులను భర్తీ చేసే అధికారాన్ని ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగించింది.

Spread the love