కాంట్రాక్ట్ అధ్యాపకులు రెగ్యులరైజ్ చేయాలి

నవతెలంగాణ-భిక్కనూర్
తెలంగాణ విశ్వవిద్యాలయ దక్షిణ ప్రాంగణంలో 12 విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను రెలైజ్ చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం మండలంలోని బిటిఎస్ వద్ద ఉన్న సౌత్ క్యాంపస్ లో కాంట్రాక్ట్ అధ్యాపకులు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నారాయణ గుప్త మాట్లాడుతూ 90 రోజుల నుండి నిరసన తెలుపుతున్న ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదని, గతంలో హామీ ఇచ్చిన విధంగా రెగ్యులర్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు యాలాద్రి, సునీత, రమాదేవి, నరసయ్య, వైశాలి, నిరంజన్ శర్మ, శ్రీకాంత్, దిలీప్, తదితరులు పాల్గొన్నారు.

Spread the love