వరద బాధితులకు వంట పాత్రలు వస్తువులు పంపిణి..

నవతెలంగాణ -తాడ్వాయి
ఇటీవల విస్తారంగా కురిసిన వర్షాలకు జంపన్న వాగు అభివృద్ధికి మిస్సయిలైన ఊరట్టం గ్రామపంచాయతీ పరిధిలోని ఊరట్టం, కన్నెపల్లి, కొత్తూరు గ్రామాల్లోని 150 వరద బాధిత కుటుంబాలకు గురువారం హైదరాబాద్ లోని అకౌంట్స్ జనరల్ కేంద్ర కార్యాలయం ఉద్యోగులు నడిపే స్వచ్చంద సంస్థ చేయూత ఫౌండేషన్ ద్వారా పంపిణి చేశారు. చేయూత ఫౌండేషన్ కార్యదర్శి అభిషేక్ మాట్లాడుతూ వరదలను మీడియా లో చూసి, ములుగు ఎమ్మెల్యే సీతక్క సోషల్ మీడియా లో వీడియోలు చూసి వంట పాత్రలు గిన్నెలు బోళ్ళు పంపిణి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో ములుగు ఎంపీటీసీ మావురపు తిరుపతి రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవిచందర్, సీతక్క యువసేన జిల్లా అధ్యక్షులు చేర్ప రవీందర్, అకౌంట్స్ జనరల్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love