నవతెలంగాణ – బిజినేపల్లి: తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లాలో భారీగా మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. బిజినేపల్లి మండలం వట్టెం గ్రామ శివారులోని మారుమూల ప్రాంతంలో ఉన్న కోళ్లఫారంలో మాదక ద్రవ్యాలు తయారు చేస్తున్నట్టు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ అధికారులకు సమాచారమందింది. డీఆర్ఐ అధికారులు బుధవారం దాడులు నిర్వహించి రూ.3.14 కోట్ల విలువైన 31.42 కిలోల ఆల్ఫ్రాజోలమ్ను స్వాధీనం చేసుకున్నారు. మాదక ద్రవ్యాలు తయారు చేస్తున్న మెషనరీని సీజ్ చేశారు. ఆల్ఫ్రాజోలమ్ తయారు చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు డీఆర్ఐ అధికారులు వెల్లడించారు.