– ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి
నవతెలంగాణ-జవహర్నగర్
మతసామరస్యానికి ప్రతీకగా ఈద్ మిలాప్ జరుపుకుంటారని ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కోఆప్షన్ సభ్యుడు మహమ్మద్ ఫారూక్ శుక్రవారం మల్కారంలో ఏర్పాటు చేసిన ఈద్ – మిలాప్ కార్యక్రమానికి పట్నం మహేందర్ రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షులు వజ్రేష్ యాదవ్, నక్క ప్రభాకర్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్ పండుగ అనంతరం కుల మతాలకు అతీతంగా జరిగే ఈద్ – మిలాప్ కార్యక్రమం లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్ నుంచి మరోసారి కాంగ్రెస్ అభ్యర్థి సునీతారెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు ముజ్జీ యుద్దీన్, జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్, డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్, కోటేష్గౌడ్, కార్పొరేటర్లు యువరాజు, సాయికుమార్, శ్రీకాంత్, యువజన సంఘం అధ్యక్షులు వినరు కుమార్, సదానం ద్, రాజుయాదవ్, వెంకన్న, వెంకటేష్ తదితరులున్నారు.