రేపు చికెన్‌, మటన్‌ దుకాణాలు బంద్‌

– కమిషనర్‌ తాజ్‌ మోహన్‌ రెడ్డి
నవతెలంగాణ-జవహర్‌నగర్‌
మహవీర్‌ జయంతి సందర్భంగా జవహర్‌ నగర్‌ నగర పాలక సంస్థ పరిధిలోని చికెన్‌, మటన్‌, ఫిష్‌, వ్యాపార దుకాణాలు ఆదివారం రోజు బంద్‌ చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ తాజ్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టరిత్యా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు.
శానిటేషన్‌ సిబ్బందితో సమావేశం
జవహర్‌ నగర్‌ మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ తాజ్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన శానిటేషన్‌ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నగర పరిధిలోని దుకాణాలదారుల నుంచి లైసెన్స్‌ ఫీజు వసూలు చేయాలని శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ కష్ఞప్ప, జవాన్లకు పలు సూచనలు చేశారు. అనంతరం కమిషనర్‌ మాట్లాడుతూ.. జవహర్‌ నగర్‌ ప్రజలందరూ చెత్తను మీ ఇంటి దగ్గరికి వచ్చే చెత్త బండిలో, లేదా మున్సిపల్‌ వారు ఏర్పాటు చేసిన చెత్తకుండీలలో వేయాలని విజ్ఞప్తి చేశారు. ఎక్కడపడితే అక్కడ వేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Spread the love