– ఎమ్మెల్యే, కాంగ్రెస్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్
నవతెలంగాణ-బంజారాహిల్స్
‘మీ కుటుంబ సభ్యునిగా మిమ్మల్ని నమ్మి మీ అందరితో చర్చించకుండా సొంత ఇంటి పార్టీలో చేరడం మీపై నమ్మకమే’ అనిఎమ్మెల్యే, కాంగ్రెస్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ అన్నారు. శుక్రవారం సికింద్రబాద్ పార్లమెంటు ఖైరతాబాద్ బూత్ లెవల్ సమావేశం జయ గార్డెన్లో జరిగింది. ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్,మేయర్ గద్వాల్ విజయలక్ష్మి,ఎంపీ రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్,ఖైరతాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు రొహిన్ రెడ్డిలతో కలిసి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్రంలో ఏర్పడ్డ ప్రజా పాలనలో ప్రజలకు సేవ చేసే అవకాశం ఇవ్వటంతో పాటు తనపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయననే భరోసాతో ఎంపీ అభ్యర్థిగా తనను ప్రకటించారని అన్నారు.నమ్మకం బలం బలహీనత మీరేననీ తనను 20 వేలకు తగ్గకుండా మెజారిటీతో విజయం అందించిన ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఆజన్మాంతం రుణపడి ఉంటానన్నారు. ఈ ఎన్నికల్లో కూడా అత్యధిక మెజారిటీ అందించాలని కోరారు. ఈ ఘనత ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజలకు దక్కాలని, నియోజ కవర్గ ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీనీ తూచా తప్పకుండా నెరవేర్చే బాధ్యత తనపై ఉందని తెలిపారు. కార్పొరేటర్లు లక్ష్మి రామన్ గౌడ్,వనం సంగీత శ్రీనివాస్ యాదవ్,మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు,ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.