వర్సిటీల ఈసీ సభ్యుల పదవీకాలం ఏడాది పొడిగింపు

–  ఉత్తర్వులు విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ (ఈసీ) సభ్యుల పదవీకాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిపాటు పొడిగించింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, మహాత్మాగాంధీ, శాతవాహన, తెలంగాణ, పాలమూరు విశ్వవిద్యాలయాలతోపాటు, డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం, జేఎన్టీయూ హైదరాబాద్‌, జేఎన్‌ఏఎఫ్‌ఏయూలకు సంబంధించి పాలక మండలి సభ్యుల పదవీకాలాన్ని ఏడాదిపాటు పొడిగిస్తున్నామని తెలిపారు.

Spread the love