విద్యార్థుల మరణాలపై 48 గంటల్లో నివేదిక అందించాలి

వీసీకి గవర్నర్‌ ఆదేశం
నవతెలంగాణ-బాసర
నిర్మల్‌ జిల్లా బాసర ఆర్జీయూకేటీ యూనివర్సిటీలో వరుసగా జరిగిన ఇద్దరు విద్యార్థినుల మరణాలపై 48 గంటల్లో సమగ్ర నివేదిక అందించాలని ఇన్‌చార్జి వీసీ వెంకటరమణకు గురువారం గవర్నర్‌ తమిళిసై ఆదేశాలు జారీ చేశారు. యూనివర్సిటీ విద్యార్థులు అధైర్య పడకూడదని, సమస్యలను ఎదుర్కొని ఉన్నత విద్యాభ్యాసాన్ని పూర్తిచేయాలని సూచించారు. భవిష్యత్తులో యూనివర్సిటీలో ఇలాంటి దురదృకర ఘటనలు చోటుచేసుకోకుండా యూనివర్సిటీ యంత్రాంగం తీసుకుంటున్న చర్యలతో కూడిన నివేదిక అందజేయాలని గవర్నర్‌ కోరారు.

Spread the love