రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ పై విస్త్రుత ప్రచారం..

– ప్రచార రథాన్ని ప్రారంభించిన నాయకులు
నవతెలంగాణ – అశ్వారావుపేట
నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తాటి వెంకటేశ్వర్లు ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ ప్రచార రథాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ యువతని,యువ శక్తిని మేల్కొలిపే విధంగా రాజీవ్ గాంధీ యూత్ డిక్లరేషన్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ ఉందని అన్నారు.ఆన్లైన్ పరీక్ష జూన్ 18 న ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు 60 ప్రశ్నలు 60 నిమిషాలు ఉంటుందని,16 నుంచి 35 సంవత్సరాల వయస్సు గల యువకులు జూన్ 17 లోపు నమోదు చేసుకోవాలని కోరారు.రిజిస్ట్రేషన్ కొరకు మిస్డ్ కాల్ ఇవ్వవలసిన నెంబర్  7661899899 ఎస్.ఎం.ఎస్ లింక్ తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జ్యేష్ట సత్యనారాయణ చౌదరి, సుంకవల్లి వీరభద్రరావు, మొగల్లపు చెన్నకేశవరావు, దాసరి నాగేంద్ర రావు, పొట్ట రాజులు, వేముల భారతి,కంటే చెన్న కేశవులు, రాంబాబు, నాగేంద్రం, మొగలి రాంబాబు, బత్తిని పార్థసారథి, అనిల్ కిష్ణ, బాబినేలు, నారం కృష్ణ, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Spread the love