ఎస్సీ కమ్యూనిటీహాల్‌ పనులకు శంకుస్థాపన

నవతెలంగాణ-చిట్యాలటౌన్‌
చిట్యాల మున్సిపాలిటీలో 30 లక్షలతో నిర్మించనున్న ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ నిర్మాణ పనులకు ఆదివారం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శంకుస్థాపన చేశారు. అనంతరం మున్సిపల్‌ వైస్‌ చైర్మెన్‌ కూరెళ్ల లింగస్వామి అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం నిరుద్యోగ దళితులకు దళిత బంధు పథకం ద్వారా 10 లక్షల వ్యక్తిగత రుణాలు అందిస్తుందన్నారు. గత నాలుగు సంవత్సరాల కాలంలో చిట్యాల పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశామని తెలిపారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో తనను తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నుకొని నకిరేకల్‌ నియోజక వర్గాన్ని మరింత అభివృద్ధి చేసే బాధ్యత కల్పించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ ఛైర్మెన్‌ కోమటిరెడ్డి చిన వెంకటరెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ జడల ఆదిమల్లయ్య, వైస్‌ చైర్మెన్‌ కూరెళ్ళ లింగస్వామి, కౌన్సిలర్లు బెల్లి సత్తయ్య, జిట్ట పద్మా, బందయ్య, కోనేటి కృష్ణ, బీఆర్‌ఎస్‌ పట్టణ పార్టీ అధ్యక్షులు పొన్నం లక్ష్మయ్య , మెండే సైదులు, కోనేటి ఎల్లయ్య, చిలువేరు శేఖర్‌, బొర్రారెడ్డి, షీలా సత్యనారాయణ, ఏళ్ల చంద్రశేఖర్‌ యాదవ్‌, దాసరి నరసింహ, బొక్క పురుషోత్తం రెడ్డి, జిట్టా చంద్రకాంత్‌, చిత్రగంటి ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love