నవతెలంగాణ- సిటీబ్యూరో : అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని తారమతీపెట్ గ్రామంలో సుప్రజ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్టు సుప్రజ హాస్పిటల్ ఎండీ సిగా విజరుకుమార్గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్ర పంచంలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జీవితం బిజీగా ఉండి తమ ఆరోగ్యాన్ని అశ్రద్ధ వహిస్తున్నారన్నారు. జీవితం చాలా విలువైనది ఆరో గ్యాన్ని కాపాడుకోవడంలో ప్రతీ ఒక్కరు శ్రద్ధ వహించాల న్నారు. సుప్రజ హాస్పిటల్లో అనుభవం ఉన్న డాక్టర్లు, అన్ని రకాల వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో ఉం టుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తారమతి పెట్ గ్రామ సర్పంచ్ మూల మహేష్ గౌడ్ ఉప సర్పంచ్ గోశిక నరసింహ ఎం.పి.టి.సి చేగురి వెంకటేష్ కార్పొరేట్ జి. ఎంసీగా అజరుకుమార్గౌడ్, మేనేజర్ సిగా సరితా జిఎం రాజేష్ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.