నవతెలంగాణ- వీణవంక
కరీంనగర్ జిల్లా కేశవపట్నం (శంకరపట్నం) మండలంలోని కల్వల వద్ద నిర్మించిన కల్వల ప్రాజెక్ట్ కింది ఆయకట్టుగల రైతులకు వరప్రదాయినిగా ఉండేది కానీ గత ఐదారు రోజుల కురుస్తున్న అతి భారీ వర్షానికి శుక్రవారం ఉదయం మత్తడి వద్ద గండిపడి దిగువకు భారీ స్థాయిలో వరద విజృంభిస్తుంది కావున ప్రాజెక్ట్ కింది గ్రామాలైన వీణవంక, బ్రాహ్మణపల్లి, మల్లన్న పల్లి, రామకృష్ణాపూర్, లక్ష్మక్క పల్లి, పోతిరెడ్డిపల్లి, జమ్మికుంట మండలంలోని కాపులపల్లి విలాసాగర్ గ్రామాలతో పాటు మానేరు పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమంతంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.